Warangal: వరంగల్ లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వినాయక నిమజ్జనం పురస్కరించుకొని నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతోంది. కావున వరంగల్, హన్మకొండతో పాటు కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా బుధవారం (నేడు) మధ్యాహ్నం 02.00 గంటల నుండి రేపు (28-09-2023) ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ కమీషనర్ తెలిపారు.
భారీ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు
Also Read
* ములుగు, భూపాలపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి. భూపాలపల్లి పరకాల నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వారు కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు మీదుగా ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
* భూపాలపల్లి, పరకాల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు నర్సంపేట, కొత్తపేట, రెడ్డిపాలెం, జన్పీరి వైపు గొర్రెకుంట వైపు వెళ్లాలి.
* నగరంలోకి వచ్చే భారీ వాహనాలను నగరం వెలుపలే ఆపాలి. నిమజ్జనం సమయంలో CT లోపల వాహనాలను అనుమతించరు.
* వరంగల్ నగరంలో అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
* ములుగు, పరకాల నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా వచ్చే బస్సులు కేయూసీ, సీపీఓ. అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ బస్టాండ్ చేరుకోవాలి.
* హన్మకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ మీదుగా కేయూసీ, జంక్షన్ మీదుగా వెళ్లాలి.
* హన్మకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
* వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండ వైపు వచ్చే బస్సులు రంగసాయిపేట, నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్డు మీదుగా చింతల్ బ్రిడ్జి మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.
వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు:
* సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం తర్వాత వాహనాలు శాయంపేట వెళ్లే రహదారి గుండా వెళ్లాలి, 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో విగ్రహాలు ఉన్న వాహనాలు, వినాయక విగ్రహాలు ఉన్న లారీలను సిద్దేశ్వర గుండంలో నిమజ్జనానికి అనుమతించరు. నిమజ్జనం కోసం వాహనాలు కోట చెరు, చిన్న వడ్డేపల్లి చెరువులకు వెళ్లాలి.
* శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాల వాహనాలు హంటర్ రోడ్డు, అదాలత్, హన్మకొండ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
* నిమజ్జనానికి కోట చెరువు వైపు వెళ్లే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, వై.జీ.యం., ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్లాలి.
* ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే అన్ని వినాయక విగ్రహాలను బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.
* చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసే వాహనాలు ఎనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపు వెళ్లాలి.
* కోట చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు హనుమాన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ మీదుగా కేయూసీ జంక్షన్ మీదుగా తిరిగి వెళ్లాలి. కావున వాహనదారులు, గణేష్ నవరాత్రి మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటించి గణేష్ శోభ యాత్రను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్