Hyderabad Traffic: బిగ్ అలర్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు భారీ హెచ్చరిక. ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లాయల్ ట్యాంక్బండ్లోని కట్ట మైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్ల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వరకు ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. వాహనదారులు లోయర్ ట్యాంక్బండ్, ఎమ్మార్వో కార్యాలయం, స్విమ్మింగ్ పూల్ మరియు కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్కు ప్రవేశం లేదు. ఇంటిపార్క్ ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, తహసీల్దార్ కార్యాలయం, లోయర్ ట్యాంక్బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని పోలీసులు సూచించారు.
Read also: Ram Charan: స్పీడ్ పెంచిన మెగా పవర్ స్టార్… 6 నెలల్లో రెండు సినిమాలు!
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు..
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇది మొత్తం 81 స్తంభాలతో నిర్మించబడింది. రూ. 450 కోట్లతో నిర్మాణానికి వెచ్చించారు. ఎస్ఆర్డిపి కింద నగరంలో నిర్మించిన 20వ ఫ్లైఓవర్ ఇది. దీనికి తెలంగాణ తొలి హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా విద్యానగర్, ఉప్పల్, నల్లకుంట వెళ్లే ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ ఉక్కు వంతెనను ఇవాళ ఉదయం 10.30 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!