Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladies Special Bus: హైదరాబాద్లోని మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే.. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు, ఆఫర్లను తీసుకువస్తోంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ప్రాంతాల్లో.. వారి సౌకర్యార్థం మరిన్ని కొత్త సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐటీ కారిడార్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ తాజాగా లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈసారి కోఠి-కొండాపూర్ రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 127కే నంబర్తో మహిళా ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
Also Read
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
ఈ మహిళా ప్రత్యేక బస్సు ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుండి బయలుదేరుతుంది. బస్సు లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ.. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కోఠికి తీసుకువస్తారు. కాగా, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని TSRTC సంస్థ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. నగరంలోని ఐటీ కారిడార్లో పనిచేస్తున్న మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం జూలై 31న టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ బస్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక సమయాల్లో JNTU నుండి వేవ్ రాక్ వరకు తిరుగుతుంది. కాగా, మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో మరికొన్ని మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు కోఠి-కొండాపూర్ మార్గంలో మరో బస్సును ప్రారంభించనున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!