Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladies Special Bus: హైదరాబాద్లోని మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే.. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు, ఆఫర్లను తీసుకువస్తోంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ప్రాంతాల్లో.. వారి సౌకర్యార్థం మరిన్ని కొత్త సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐటీ కారిడార్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ తాజాగా లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈసారి కోఠి-కొండాపూర్ రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 127కే నంబర్తో మహిళా ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
ఈ మహిళా ప్రత్యేక బస్సు ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుండి బయలుదేరుతుంది. బస్సు లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ.. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కోఠికి తీసుకువస్తారు. కాగా, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని TSRTC సంస్థ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. నగరంలోని ఐటీ కారిడార్లో పనిచేస్తున్న మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం జూలై 31న టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ బస్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక సమయాల్లో JNTU నుండి వేవ్ రాక్ వరకు తిరుగుతుంది. కాగా, మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో మరికొన్ని మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు కోఠి-కొండాపూర్ మార్గంలో మరో బస్సును ప్రారంభించనున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!