Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladies Special Bus: హైదరాబాద్లోని మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే.. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు, ఆఫర్లను తీసుకువస్తోంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ప్రాంతాల్లో.. వారి సౌకర్యార్థం మరిన్ని కొత్త సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐటీ కారిడార్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ తాజాగా లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈసారి కోఠి-కొండాపూర్ రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 127కే నంబర్తో మహిళా ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
ఈ మహిళా ప్రత్యేక బస్సు ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుండి బయలుదేరుతుంది. బస్సు లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ.. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కోఠికి తీసుకువస్తారు. కాగా, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని TSRTC సంస్థ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. నగరంలోని ఐటీ కారిడార్లో పనిచేస్తున్న మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం జూలై 31న టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ బస్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక సమయాల్లో JNTU నుండి వేవ్ రాక్ వరకు తిరుగుతుంది. కాగా, మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో మరికొన్ని మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు కోఠి-కొండాపూర్ మార్గంలో మరో బస్సును ప్రారంభించనున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!