Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
Ladies Special Bus: హైదరాబాద్లోని మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే.. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు, ఆఫర్లను తీసుకువస్తోంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ప్రాంతాల్లో.. వారి సౌకర్యార్థం మరిన్ని కొత్త సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐటీ కారిడార్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ తాజాగా లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈసారి కోఠి-కొండాపూర్ రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 127కే నంబర్తో మహిళా ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
ఈ మహిళా ప్రత్యేక బస్సు ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుండి బయలుదేరుతుంది. బస్సు లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ.. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కోఠికి తీసుకువస్తారు. కాగా, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని TSRTC సంస్థ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. నగరంలోని ఐటీ కారిడార్లో పనిచేస్తున్న మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం జూలై 31న టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ బస్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక సమయాల్లో JNTU నుండి వేవ్ రాక్ వరకు తిరుగుతుంది. కాగా, మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో మరికొన్ని మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు కోఠి-కొండాపూర్ మార్గంలో మరో బస్సును ప్రారంభించనున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో