ఆ రైతులవి సహజ మరణాలు కాదు.. హత్యలు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారు. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని అన్నారు. మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదు. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు. రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారు. మోడీ చట్టాలు తెచ్చినపుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చెయ్యలేదు. ఏ ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదు.. ఒక్క రైతును పరమర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేయడం లేదు. ఎప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే అని తెలిపారు.
ఇక మోడీకి మొదటి నుంచి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు. నోట్ల రద్దు కాడి నుంచి త్రిబుల్ తలాక్ వరకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉంది. కేసీఆర్ వెంటనే రైతులను ధాన్యం అంత కొనాలి. మోదీని నమ్మొద్దు.. మోడీ వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసేలా పోరాటాలు చేయాలి. పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుంది. వరి రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ మోసాలను రైతులు అర్థం చేసుకోవాలి. వరి రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు ఉరి వెయ్యాలి. రాష్ట్రంలో ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తాం… రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!