ఆ రైతులవి సహజ మరణాలు కాదు.. హత్యలు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారు. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని అన్నారు. మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదు. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు. రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారు. మోడీ చట్టాలు తెచ్చినపుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చెయ్యలేదు. ఏ ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదు.. ఒక్క రైతును పరమర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేయడం లేదు. ఎప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే అని తెలిపారు.
ఇక మోడీకి మొదటి నుంచి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు. నోట్ల రద్దు కాడి నుంచి త్రిబుల్ తలాక్ వరకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉంది. కేసీఆర్ వెంటనే రైతులను ధాన్యం అంత కొనాలి. మోదీని నమ్మొద్దు.. మోడీ వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసేలా పోరాటాలు చేయాలి. పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుంది. వరి రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ మోసాలను రైతులు అర్థం చేసుకోవాలి. వరి రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు ఉరి వెయ్యాలి. రాష్ట్రంలో ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తాం… రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!