TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు రండి
- జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ కౌంటర్
- పొంగులేటిపై ఆరోపణలు… ఆధారాలు చూపాలంటూ సవాల్
- బీఆర్ఎస్ పాలనపై మహేష్ గౌడ్ విమర్శలు
- డిప్యూటీ సీఎం రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ప్రతిపక్షాల విమర్శలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వ పనితీరు , భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్పై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. “జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 సార్లు బీ-ఫాం ఇచ్చింది. ఆయన రాజకీయ ఎదుగుదలకు పార్టీ ఎంతో కృషి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటి నేతపై ‘రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ అని మాట్లాడటానికి జీవన్ రెడ్డి ఎవరు?” అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని జీవన్ రెడ్డి స్వయంగా అనేకసార్లు విమర్శించారని, ఇప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!
Also Read
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలను పీసీసీ చీఫ్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. “పొంగులేటి అవినీతిపై ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే నేరుగా గాంధీ భవన్కు రండి. చర్చకు నేను సిద్ధం, నా సవాల్ను స్వీకరించండి. పక్కా ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం తరపున కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప, బట్టకాల్చి మీద వేస్తామంటే కుదరదు” అని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జేబులు నింపుకున్నారని, నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. నాటి దోపిడీ గురించి ఇప్పుడు కవిత కూడా చెబుతున్నారని, అప్పట్లో దోచుకున్న వారు నేడు మా మంత్రులపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
మహేష్ కుమార్ గౌడ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నాకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని వస్తున్న వార్తలు చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ, ఆ వార్తలు ఎందుకు రాస్తున్నారో, దేని ఆధారంగా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండటమే నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. మంత్రి పదవుల కంటే పీసీసీ పదవే బెటర్ అని నా భావన. మంత్రి పదవుల భర్తీ అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) పరిధిలోని అంశం. ప్రస్తుతానికి పార్టీ కోసం పనిచేస్తూ, సంస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం” అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, తాను పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!