TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు రండి
- జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ కౌంటర్
- పొంగులేటిపై ఆరోపణలు… ఆధారాలు చూపాలంటూ సవాల్
- బీఆర్ఎస్ పాలనపై మహేష్ గౌడ్ విమర్శలు
- డిప్యూటీ సీఎం రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ప్రతిపక్షాల విమర్శలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వ పనితీరు , భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్పై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. “జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 సార్లు బీ-ఫాం ఇచ్చింది. ఆయన రాజకీయ ఎదుగుదలకు పార్టీ ఎంతో కృషి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటి నేతపై ‘రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ అని మాట్లాడటానికి జీవన్ రెడ్డి ఎవరు?” అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని జీవన్ రెడ్డి స్వయంగా అనేకసార్లు విమర్శించారని, ఇప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!
Also Read
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలను పీసీసీ చీఫ్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. “పొంగులేటి అవినీతిపై ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే నేరుగా గాంధీ భవన్కు రండి. చర్చకు నేను సిద్ధం, నా సవాల్ను స్వీకరించండి. పక్కా ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం తరపున కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప, బట్టకాల్చి మీద వేస్తామంటే కుదరదు” అని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జేబులు నింపుకున్నారని, నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. నాటి దోపిడీ గురించి ఇప్పుడు కవిత కూడా చెబుతున్నారని, అప్పట్లో దోచుకున్న వారు నేడు మా మంత్రులపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
మహేష్ కుమార్ గౌడ్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నాకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని వస్తున్న వార్తలు చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ, ఆ వార్తలు ఎందుకు రాస్తున్నారో, దేని ఆధారంగా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండటమే నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. మంత్రి పదవుల కంటే పీసీసీ పదవే బెటర్ అని నా భావన. మంత్రి పదవుల భర్తీ అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) పరిధిలోని అంశం. ప్రస్తుతానికి పార్టీ కోసం పనిచేస్తూ, సంస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం” అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, తాను పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!