Revanth Reddy: జయశంకర్ సొంతూరులో రచ్చబండ.. కేసీఆర్ను దంచుడే, దించుడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేట నిరాధారణకు గురైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేటలో రైతు రచ్చబండ నిర్వహించిన రేవంత్రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ప్రగతిభవన్ గడి గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు.. జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేటలో కనీసం ఆయన విగ్రహం పెట్టలేదని మండిపడ్డ ఆయన.. చివరకు కొండా దంపతులే జయశంకర్ విగ్రహం పెట్టారని గుర్తుచేశారు..
Read Also: Attack: చెరువు కబ్జా..! బీజేపీ నేతలపై గోపన్పల్లి వాసుల దాడి
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇక, అక్కంపేటను తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు రేవంత్రెడ్డి.. అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకొస్తానన్న ఆయన.. జయశంకర్ స్ఫూర్తితో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాను.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ గంగల కలుపుతా.. కేసీఆర్ను బొందలో పెడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ను చెప్పులతో కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్ దంచుడే… కేసీఆర్ను అధికారంలో నుంచి దించుడేనంటూ హెచ్చరించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.
మరోవైపు, కడియం శ్రీహరి, మధుసూదనాచారిలను కేసీఆర్ ఇళ్లలో కూర్చోబెట్టారని విమర్శించారు రేవంత్రెడ్డి.. అభివృద్ధి నమూనా ఎక్కడ ఉండాలి అంటే దళిత కాలనీల్లో ఉండాలి.. కానీ, ఎలా ఉంది అని చుస్తే దళిత కాలనీల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు.. దళిత ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో పెట్టి కొట్టండి అని పిలుపునిచ్చారు. అక్కంపేట గ్రామస్థులపైనా కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. గిట్టుబాటు ధర ఇస్తాం, 2 లక్షలరుణ మాఫీ చేస్తాం అని ప్రటించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్తో రైతులకు లాభం చేకూరుతుందన్నారు.
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!