Ujjaini Bonalu: రేపు ఉజ్జయని మహంకాళి బోనాలు.. ఉదయం 4 గంటలకు తొలిబోనం
Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాడ మాసంలో జరుపుకునే వార్షిక రాష్ట్ర పండుగ బోనాలు ఉత్సవ్ జూలై 9 ఆదివారం నాడు జరగనుంది. ఆలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవం అనంతరం వార్షిక రంగం వ్రతం జూలై 10వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాడమాసం జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానుందని అంచనా. జూలై 16 వరకు కొనసాగి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బోనాల పండుగను నిర్వహించనున్నారు. వార్షిక బోనాలు ఉత్సవ్ గోల్కొండలో ప్రారంభమవుతుంది, తరువాత సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు.
సికింద్రాబాద్లో జరిగిన బోనాల కార్యక్రమంలో తలసాని మాట్లాడుతూ.. ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ సంబంధిత అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహిస్తోందని, ఈ పండుగలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జలమండలి డైరెక్టర్ కృష్ణతో కలిసి మంత్రి ఆలయ పరిసరాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తామని తెలిపారు. ఇప్పటికే భక్తులు భారీగా తరలివస్తారని, ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లను మంత్రి జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులకు వివరించారు.
Also Read
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
Read also: TS Weather: తెలంగాణకు వర్షసూచన.. వెదర్ బులిటెన్ విడుదల చేసిన వాతావరణశాఖ
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారులను చదును చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు తెగిపోతున్నాయని భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ట్రాన్స్కో అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడా మురుగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా బారికేడ్ల నిర్మాణం చేపడుతున్నామని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు అడుగడుగునా మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతర కారణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ ను మళ్లించాలని తెలిపారు.
శుక్రవారం లాల్దర్వాజ్లో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన పాతబస్తీలో తెలంగాణ సంప్రదాయంలో వేడుకలు జరిగాయి. 115వ వార్షిక బోనాల పండుగ సందర్భంగా తెల్లవారుజామున భక్తుల కోలాహలం మధ్య గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవీ అభిషేకం, అఖండ హారతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ సోదరుడు సి.శివకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకార పూజలు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారి దర్శనానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
PM MODI: వరంగల్లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం
తాజావార్తలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!