Ujjaini Bonalu: రేపు ఉజ్జయని మహంకాళి బోనాలు.. ఉదయం 4 గంటలకు తొలిబోనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాడ మాసంలో జరుపుకునే వార్షిక రాష్ట్ర పండుగ బోనాలు ఉత్సవ్ జూలై 9 ఆదివారం నాడు జరగనుంది. ఆలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవం అనంతరం వార్షిక రంగం వ్రతం జూలై 10వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాడమాసం జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానుందని అంచనా. జూలై 16 వరకు కొనసాగి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బోనాల పండుగను నిర్వహించనున్నారు. వార్షిక బోనాలు ఉత్సవ్ గోల్కొండలో ప్రారంభమవుతుంది, తరువాత సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు.
సికింద్రాబాద్లో జరిగిన బోనాల కార్యక్రమంలో తలసాని మాట్లాడుతూ.. ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ సంబంధిత అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహిస్తోందని, ఈ పండుగలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జలమండలి డైరెక్టర్ కృష్ణతో కలిసి మంత్రి ఆలయ పరిసరాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తామని తెలిపారు. ఇప్పటికే భక్తులు భారీగా తరలివస్తారని, ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లను మంత్రి జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులకు వివరించారు.
Also Read
Read also: TS Weather: తెలంగాణకు వర్షసూచన.. వెదర్ బులిటెన్ విడుదల చేసిన వాతావరణశాఖ
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారులను చదును చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు తెగిపోతున్నాయని భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ట్రాన్స్కో అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడా మురుగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా బారికేడ్ల నిర్మాణం చేపడుతున్నామని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు అడుగడుగునా మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతర కారణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్ ను మళ్లించాలని తెలిపారు.
శుక్రవారం లాల్దర్వాజ్లో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన పాతబస్తీలో తెలంగాణ సంప్రదాయంలో వేడుకలు జరిగాయి. 115వ వార్షిక బోనాల పండుగ సందర్భంగా తెల్లవారుజామున భక్తుల కోలాహలం మధ్య గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవీ అభిషేకం, అఖండ హారతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ సోదరుడు సి.శివకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకార పూజలు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారి దర్శనానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
PM MODI: వరంగల్లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!