KTR: నేడు మహబూబ్నగర్కు కేటీఆర్.. జడ్చర్లలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పర్యటనకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మూసాపేట మండలంలోని వేముల, మహబూబ్ నగర్, జడ్చర్లలో మూడు చోట్ల కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్తో పాటు మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లార్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొంటారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలో ఏర్పాట్లను పరిశీలించారు.
Read also: Sri Sai Chalisa: శ్రీ సాయి చాలీసా వింటే మనోభీష్టాలను సిద్ధిస్తాయి
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
సెయింట్ ఫౌండేషన్ మరియు శాంతనారాయణగౌడ్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం, కేంద్రం నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. మార్చి నెలలో నిర్వహించే స్కిల్ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లోనే హాస్టల్ వసతి ఉందన్నారు. మహిళలకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించిన సెయింట్ ఫౌండేషన్ నిర్వాహకుడు ప్రద్యుమ్న, శాంతానారాయణగౌడ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహితలను అభినందించనున్నారు. యువజన సంక్షేమ శాఖ ఇప్పటికే జిల్లాలో 45 కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.
పర్యటన ఇలా..
* హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరనున్నారు.
* 9:15కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 10 గంటలకు హెలికాప్టర్లో భూత్పూర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
* ఉదయం 10:15 గంటలకు భూత్పూర్లోని మున్సిపల్ పార్కును ప్రారంభిస్తారు.
* 10:30 గంటలకు మూసాపేట మండలం వేములలోని ప్రైవేట్ కంపెనీ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు.
* 11 గంటలకు మహబూబ్నగర్ బాలికల ఐటీఐలో మైక్రో రూరల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన, బహిరంగ సభ.
* మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలోని ఎర్రగుట్టలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటింటికి పరిచయం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు
Pakistan: పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?
Pakistan: పేదరికాన్ని నివారించడానికి పాకిస్తాన్ వ్యూహాలు.. ఇలా కూడా చేస్తారా?
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!