BRS First List: నేడే బీఆర్ఎస్ తొలి జాబితా.. అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS First List: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 105 మంది అభ్యర్థులను కేసీఆర్ విడుదల చేయనున్నారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న కేసీఆర్ విడుదల చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేసీఆర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా 88 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన విజయవంతమైన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 103కు చేరుకుంది.ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ ఈసారి 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని సమాచారం.
Read also: Naga Panchami: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇష్టకామ్యములు నెరవేరుతాయి
Also Read
ఆదిలాబాద్లో నలుగురు, కరీంనగర్లో ఇద్దరికి, ఖమ్మంలో ఇద్దరికి, వరంగల్లో ఇద్దరికి, జీహెచ్ఎంసీలో ఒకరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం సీఎం కేసీఆర్కు ఇష్టం లేదన్న ప్రచారం సాగుతోంది. 2018లో ఏడుగురు సిట్టింగులకు సీట్లు నిరాకరించిన కేసీఆర్.. ఈ ఏడు స్థానాల్లో పోటీ చేసిన కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా 11 స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం దక్కే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలోని 10 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నెలకొంది. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వొద్దని కోరారు. అయితే ఈ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లు కాకుండా విపక్షాల డిమాండ్లను కేసీఆర్ పట్టించుకుంటారా అనేది అభ్యర్థుల జాబితా ద్వారా తేలిపోనుంది. తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకత్వం పలు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత టిక్కెట్ రాని అభ్యర్థులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఇవ్వని అభ్యర్థులను పిలిచి కేసీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేటీఆర్ను కోరుతున్నారు.
IND vs IRE: మెరిసిన రుతురాజ్, శాంసన్, రింకూ.. రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు!
తాజావార్తలు
-
Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
-
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!