Mrigasira Karte: నేడు మృగశిర కార్తె.. ముమ్మరంగా చేపల విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrigasira Karte: మృగశిర కార్తె నేటితో ప్రారంభం. మృగశిర కార్తెలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ కార్తె రాకను వర్షాలు కురిసే సూచనగా రైతులు భావిస్తారు. ఈ సీజన్లో, నైరుతి రుతుపవనాల వర్షం వాతావరణాన్ని చల్లబరుస్తుంది, వేడిని తగ్గిస్తుంది. మృగశిరను వివిధ ప్రాంతాలలో మృగశిర, మిరుగ అని పిలుస్తారు. మృగశిర ప్రారంభం రోజున ఇంగువలో బెల్లం కలిపి తింటారు. మృగశిర రోజు చేపలు తింటే రోగాలు దరిచేరవని ప్రజల నమ్మకం. ఇందుకోసం జిల్లా కేంద్రంలో చేపల విక్రయాలకు వ్యాపారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చేపలను ప్రధాన మార్కెట్లు, మార్కెట్లలో విక్రయించనున్నారు.
Read also: Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!
Also Read
సాధారణ రోజుల కంటే ఎక్కువ ధరలకు చేపలు విక్రయిస్తుంటారు. మార్కెట్లలో అన్ని వర్గాల ప్రజలు చేపలను కొనుగోలు చేస్తారు. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాపారులు ఇప్పటికే పెద్దమొత్తంలో చేపలను దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. చేపలకు డిమాండ్ ఉండటంతో ధర కూడా పెరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్, పానగల్ బైపాస్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, బస్టాండ్, రామగిరి, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రోడ్ల పక్కన కుప్పలు తెప్పలుగా చేపలు విక్రయిస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. బొచ్చ, రవ్వ కిలో రూ.180 నుంచి రూ.200, పాంప్లెట్లు చిన్న సైజు రూ.50 నుంచి రూ.60, పెద్ద సైజు రూ.80 నుంచి రూ.100, బురదమట్టలు రూ.400 నుంచి రూ.450, కొర్రమె. 500 నుండి రూ. .700, రొయ్యలు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవడంతో చెరువుల్లో చేపల ఉత్పత్తి తగ్గింది. దీంతో చేపల ఉత్పత్తి కూడా కొద్దిగా తగ్గింది. తుమ్మలగూడ, మిర్యాలగూడ, ఆదివాదేవులపల్లి, పానగల్లు ఉదయసముద్రం, నాగార్జునసాగర్, డిండి, మూసీ తదితర ప్రాంతాలతోపాటు నల్గొండ జిల్లాలోని గుంటూరు, బాపట్ల, తెనాలి తదితర ప్రాంతాల్లోని చెరువుల నుంచి వ్యాపారులు చేపలను దిగుమతి చేసుకున్నారు.
Congress: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!