తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,00,632 మంది సాంపిల్స్ పరీక్షించగా… కొత్తగా 704 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 3,725 మంది మృతిచెందారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.