తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 218 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు.. ఇక, 248 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,971 కు చేరగా.. రికవరీ కేసులు 6,58,657 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,924 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,390 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 46,578 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్.