తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,135 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 207 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 239 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,735 కి చేరగా.. రికవరీ కేసులు 6,58,409 కి పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,923 కు పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,421 యాక్టివ్ కేసులు ఉన్నాయి బులెటిన్లో పేర్కొన్నారు.