తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,166 శాంపిల్స్ పరీక్షించగా.. 190 మందికి పాజిటివ్గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందగా.. 245 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,725 కు చేరగా.. రికవరీ కేసులు 6,59,508 కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్తో 3,929 మంది ప్రాణాలు వదిలితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,288 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.