Tigers and Leopards: భయం భయం.. ఓవైపు పులులు.. మరోవైపు చిరుతలు..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో పులులు చిరుత పులుల సంచారం ఎక్కువైంది. మొన్నీమధ్య ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పులులు సంచరించి వెళ్లిపోగా.. ఉన్నన్ని రోజులు పశువుల పై పంజా విసిరాయి.. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో నీ చిన్న రాజురా శివారులో పులి సంచరిస్తుంది. గ్రామ పరిధిలో నీ పెద్ద వాగు వద్ద పులి పాదముద్రలు చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యరు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాదముద్రలు చూసి ఇది పులివేనని ధృవీకరించారు. నీరు తాగడానికి వాగు వాగు వద్ద వచ్చిందని మల్ల తిరిగి భీంపూర్ మీదుగా ఖనర్ గాం , కాగజ్ నగర్ వైపు వెళ్లిందని భావిస్తున్నారు అటవీశాఖ అధికారులు.
Read Also: Teachers Transfers: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
మరోవైపు, కుంటాల మండలం దౌనెల్లి శివారులో చిరుత సంచారం రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది. అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. ఆవు నర్సాపూర్ జీ మండలం భూర్గూపెళ్ళి (జీ) కి చెందిన రైతుదిగా గుర్తించారు. చిరుత సంచారంతో భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంటే మహారాష్ట్ర సరిహద్దులో బెబ్బిలి భయం వెంటాడుతుంది. చంద్రపూర్ జిల్లా రాజుర తాలూకాలోని పులి సంచరిస్తుంది. మకోడి గ్రామం పరిధిలో రైల్వే ట్రాక్ వేసే కార్మికులకు పులి కనిపించింది. ఇక, గడ్చిరోలి జిల్లాలో పులి దాడిలో గాయపడ్డ మహిళ ప్రాణాలు కోల్పోయారు. అంబేశివ్ ని గ్రామంలోని వరి పొలంలో పనిచేస్తున్న సోనీ జితేంద్ర ఉండిర్వాడే (24) అనే మహిళ ఈనెల 4న పులి దాడి చెయ్యడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.. అటు చంద్రాపూర్ ఇటు గడ్చిరోలి జిల్లా ల్లో వరుసగా మనుషులను చంపేస్తున్నాయి పులులు. ఇక తెలంగాణలో సైతం ఇప్పటి వరకూ పులులు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి.. ఆ మూడు ఘటనలో కొమురం భీం జిల్లాలో లోనే జరిగాయి.. ఓవైపు పులులు, మరోవైపు చిరుతలతో భయాందోళనకు గరవుతున్న ప్రజలు.. వాటిని పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!