Tiger Fear: బాబోయ్ పులి.. కంటిమీద కునుకులేని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులుల సంచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది..ఏజెన్సీ ప్రాంతాలకు తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది..ఆదిలాబాద్ జిల్లాలో చిరుత,కొమురం బీం మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ,బజార్ హత్నూర్ మండలంలోని పలు గ్రామశివారులలో చిరుత సంచారం కలకలం రేపుతోంది..ఏప్రీల్ నెల నుంచి ఈరెండు మండలాలతోపాటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపిస్తోంది…తాజాగా బోథ్ మండలం జీడిపల్లె శివారులో ఓ రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది చిరుత..అంతకంటే ముందు బజార్ హత్నూర్ మండలం భూతాయి బీ గ్రామ శివారులో రెండు ఆవులపై దాడి చేసింది చిరుత.ఇందులో ఒక్క ఆవు చనిపోయగా మరో ఆవు చావుబతుకుల్లో ఉంది.
Also Read
Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
అటవీ ప్రాంతంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో చిరుత జనం కంటపడుతుండగా భయాందోళనకు గురౌతున్నారు జనం. పంటపొలాల వైపు వెళ్ళాలంటే భయమేస్తోందంటున్నారు రైతులు. ఇదిలా ఉంటే కొమురం భీం జిల్లాలో ఇటీవల పులి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది..పెంచికల్ పేట మండలం గుండెపల్లి అటవీప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది..దీనికి తోడు ఇదే మండలంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం, ఆవులపై దాడి చేయడంతో జనం భయపడిపోతున్నారు.
ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది..మండలంలోని ఎడగట్ట, మల్లంపేట, కొటపల్లి, పారుపల్లి గ్రామాలలోని సమీప అటవీ ప్రాంతాలలో వారం రోజుల నుండి పులి సంచరిస్తోంది…పులి కదలికలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు..పులి సంచారంలో జనం భయాందోళనకు గురౌతున్నారు. దీంతో గ్రామాల్లో దండోరా వేయించి పులి కదలికలు ఉన్నాయని జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు…పైగా అటవీ ప్రాంతం వైపు పశువులను తీసుకెళ్ళవద్దని చాటింపు చేయిస్తున్నారు.
మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పులి కొద్ది రోజులుగా వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తుండగా రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం అటవీప్రాంతాల వైపు వెళ్ళవద్దని, పశువులను సైతం అటువైపు పంపించవద్దని చెబుతున్నారు..దీంతో పాటు పులి రక్షణ కోసం చర్యలు చేపట్టామని వివరిస్తున్నారు. ఏది ఏమైనా అటు పులి….ఇటు చిరుత సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేయడమే కాదు పశువులపై పంజా విసురుతున్నాయి..అధికారులు మాత్రం వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెబుతున్నారు..జనం అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు..గతకొంతకాలంగా పులి సంచారం లేకుండా ఉన్న ఏరియాల్లో మళ్లీ పులి కదలికలు కనిపిస్తుండగా జనం భయంగుప్పిట్లో ఉంటున్నామంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!