Tiger Fear: బాబోయ్ పులి.. కంటిమీద కునుకులేని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పులుల సంచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది..ఏజెన్సీ ప్రాంతాలకు తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది..ఆదిలాబాద్ జిల్లాలో చిరుత,కొమురం బీం మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ,బజార్ హత్నూర్ మండలంలోని పలు గ్రామశివారులలో చిరుత సంచారం కలకలం రేపుతోంది..ఏప్రీల్ నెల నుంచి ఈరెండు మండలాలతోపాటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపిస్తోంది…తాజాగా బోథ్ మండలం జీడిపల్లె శివారులో ఓ రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది చిరుత..అంతకంటే ముందు బజార్ హత్నూర్ మండలం భూతాయి బీ గ్రామ శివారులో రెండు ఆవులపై దాడి చేసింది చిరుత.ఇందులో ఒక్క ఆవు చనిపోయగా మరో ఆవు చావుబతుకుల్లో ఉంది.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
అటవీ ప్రాంతంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో చిరుత జనం కంటపడుతుండగా భయాందోళనకు గురౌతున్నారు జనం. పంటపొలాల వైపు వెళ్ళాలంటే భయమేస్తోందంటున్నారు రైతులు. ఇదిలా ఉంటే కొమురం భీం జిల్లాలో ఇటీవల పులి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది..పెంచికల్ పేట మండలం గుండెపల్లి అటవీప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది..దీనికి తోడు ఇదే మండలంతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం, ఆవులపై దాడి చేయడంతో జనం భయపడిపోతున్నారు.
ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది..మండలంలోని ఎడగట్ట, మల్లంపేట, కొటపల్లి, పారుపల్లి గ్రామాలలోని సమీప అటవీ ప్రాంతాలలో వారం రోజుల నుండి పులి సంచరిస్తోంది…పులి కదలికలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు..పులి సంచారంలో జనం భయాందోళనకు గురౌతున్నారు. దీంతో గ్రామాల్లో దండోరా వేయించి పులి కదలికలు ఉన్నాయని జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు…పైగా అటవీ ప్రాంతం వైపు పశువులను తీసుకెళ్ళవద్దని చాటింపు చేయిస్తున్నారు.
మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన పులి కొద్ది రోజులుగా వరుసగా పశువులపై దాడి చేసి చంపేస్తుండగా రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు మాత్రం అటవీప్రాంతాల వైపు వెళ్ళవద్దని, పశువులను సైతం అటువైపు పంపించవద్దని చెబుతున్నారు..దీంతో పాటు పులి రక్షణ కోసం చర్యలు చేపట్టామని వివరిస్తున్నారు. ఏది ఏమైనా అటు పులి….ఇటు చిరుత సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేయడమే కాదు పశువులపై పంజా విసురుతున్నాయి..అధికారులు మాత్రం వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెబుతున్నారు..జనం అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు..గతకొంతకాలంగా పులి సంచారం లేకుండా ఉన్న ఏరియాల్లో మళ్లీ పులి కదలికలు కనిపిస్తుండగా జనం భయంగుప్పిట్లో ఉంటున్నామంటున్నారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?