Tiger Attack: సిరిసిల్లలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Attack: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి ఓ యువకుడిపై చిరుత దాడి చేసింది. ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలో చిరుత బీభత్సం సృష్టించింది. బొల్లారం నాగరాజు అనే రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసింది. పొలం సమీపంలో ఉన్న దూడపై చిరుత దాడి చేయడంతో దూడ మృతి చెందింది. చిరుతపులి దాడితో ప్రజలు, రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో మరో చిరుత కూడా సంచరిస్తోంది. కల్హేర్ మండలంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. ఈరోజు చింతల్ గడి సమీపంలో చిరుతపులి వాహనదారులకు కనిపించింది. కల్హేర్ మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
తాజాగా.. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పులుల సంచారం మండల గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చీకోడు గ్రామానికి చెందిన రాజు అనే రైతు చిప్పళ్లపల్లి గ్రామ శివారులోని తన పొలం వద్ద కట్టివేసిన దూడ చిరుత దాడితో మృతి చెందింది. తెల్లవారు జామున రాజు పొలానికి వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత దాడి వల్లే దూడ మృతి చెందినట్లు గుర్తించారు. స్థానిక ప్రాంతాల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఒంటరిగా వ్యవసాయ పొలాలకు కూడా వెళ్లకూడదని తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని అన్నారు. అంతేకాకుండా.. కొన్ని నెలల క్రింతం సిరిసిల్ల జిల్లాలో చిరుత పదిరోజుల్లోనే వరుస దాడులు చేసింది. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చిరుతపులిల సంచారం రైతులతో పాటు గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది.
Read also: Guntur Kaaram: దిద్దుబాటు చర్యలా? మూడో పాట అప్పుడే బయటకి వస్తుందా?
పది రోజుల క్రితం వేణుగోపాలపూర్లో గేదె, రెండు దూడలను చంపిన చిరుత గత రాత్రి గండిలచ్చపేట గ్రామంలోకి ప్రవేశించి శివారులోని గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపింది. రైతు పొలం దగ్గర గేదెను కట్టేసి ఇంటికి వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న పాదముద్రల ఆధారంగా చిరుతపులి దాడి చేసిందని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. మొదటి నుంచి గ్రామంలోని రైతులు తమ పశువులను పొలాల్లోనే ఉంచేవారని, గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుత దాడి చేసిందని వాపోయారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తూ వరుస దాడులు చేస్తూ గేదెలు, దూడలను చంపడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Bigg Boss7 Telugu : బిగ్ బాస్ ఫినాలే కి స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసే సెలెబ్రేటీలు ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!