Tirupathi: హైదరాబాద్-తిరుపతి మార్గంలో డైనమిక్ టికెటింగ్ సిస్టం.. రద్దీని బట్టి పెరగనున్న ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupathi: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి హైదరాబాద్-తిరుపతి రూట్లలో డైనమిక్ టికెట్ ధరల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రయాణికుల డిమాండ్, సీట్ల ఆక్యుపెన్సీ, టికెట్ బుకింగ్ ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీని కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడ, బెంగళూరుతో పాటు పలు రూట్లలో ఇప్పటికే డైనమిక్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో తిరుపతి వెళ్లే బస్సుల్లో టిక్కెట్ చార్జీలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తుంటారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే బస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణీకుల డిమాండ్ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టిక్కెట్ ధరలు పెరుగుతాయి.
Read also: Telangana : ఓర్నీ.. డబ్బులు, నగలతో పాటు టమోటాలు చోరీ..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే TSRTC సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుతం రూ.1,060 ధర ఉంది. రాజధాని ఏసీ సెమీ స్లీపర్ బస్సులకు రూ.1,340, లహరి ఏసీ స్లీపర్ బస్సులకు రూ.2,150, గరుడ ప్లస్ బస్సులకు రూ.1,580 టిక్కెట్ ధర. డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అమలుతో ఈ రూట్లలో తిరిగే బస్సుల ఛార్జీలు 25 శాతం పెరగనున్నాయి. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ తరహా విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో టిక్కెట్ ఛార్జీలు భారీగా పెంచుతారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఈ విధానాన్ని అమలు చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. విజయవాడ, బెంగళూరు రూట్లలో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ఆదాయం సగటున 15 శాతం పెరిగింది. దీంతో ప్రస్తుతం తిరుపతి వెళ్లే బస్సులను తీసుకురాగా, రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మరిన్ని రూట్లలో అమలు చేయనున్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రయివేటు బస్సుల యాజమాన్యాలకు పోటీగా ప్రయాణికులను ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటిస్తున్నారు. అలాగే పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచడం వల్ల భారీగా ఆదాయం సమకూరుతుంది. దీంతో పాటు పలు రూట్లలో కొత్త స్లీపర్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Nothing Phone 2 Launch: మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 2.. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ! ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!