Telangana : ఓర్నీ.. డబ్బులు, నగలతో పాటు టమోటాలు చోరీ..
దేశంలో టమోటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. టమోటాల వాడకాన్ని చాలా వరకు తగ్గించారు..ఇక కొందరు గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది.. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే రేట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..
రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి.. దాంతో వరుసగా టమోటా చో్రీలు కూడా జరుగుతున్నాయి.. ఇటీవల ఇలాంటి ఎక్కువ అవుతున్నాయి.. ఆఖరికి దొంగలు కూడా ఇంట్లో చోరికి వచ్చి టమోటాలను తీసుకెళ్తున్నారు.. తాజాగా తెలంగాణాలో ఒక విచిత్ర దొంగతనం జరిగింది..ఇంట్లో నగదు, బంగారం ఎత్తుకు పోవడానికి వచ్చిన దొంగలు.. ఫ్రిడ్జ్ లోని కిలో టమోటాలను కూడా ఎత్తుకుపోవడం చూసి ఇంటి వాళ్ళు అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వెలుగు చూసింది. పట్నంలోని ఓ ఇంట్లోని వారు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం రాత్రి వారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత ఫ్రిజ్లో ఉన్న కిలో టమాటాలను కూడా వదలకుండా తీసుకెళ్లినట్టున్నారు…
Also Read
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
మున్సిపల్ ఉద్యోగి రఫీ కుటుంబం బోధనలోని గౌడ్స్ కాలనీలో నివాసం ఉంటుంది. సోమవారం సాయంత్రం వీరంతా ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి. వెళ్లారు. తర్వాత రోజు మళ్లీ ఇంటికి వచ్చారు.. ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించారు..బీరువాలో దాచి ఉంచిన నగదు రూ.1.28లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని గమనించారు..ఆ తర్వాత ఇల్లు గమనిస్తుండగా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉంది. అందులో చూడగా కిలో టమాటాలు కూడా కనిపించలేదు. దీంతో వాటిని కూడా దొంగలే ఎత్తుకెళ్లారని గుర్తించారు. మంగళవారం బాధితులు రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!