Harish Rao: ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. సభకోసం మంత్రలు ఖమ్మం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంత్రి హరీష్ రావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్రవీరయ్య, రెడ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Kishan Reddy: తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్లా మంత్రిని కాలేదు.. కష్టపడి పైకి వచ్చాం..
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన సభ కరీంనగర్ సభ అని, దేశ రాజకీయాలను మలుపుతిప్పబోయే సభ ఖమ్మం సభ అని ఆయన అన్నారు. ప్రస్తుతం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. నేడు తెలంగాణ చేస్తుందే.. రేపు దేశం ఆచరిస్తుంది అని పేర్కొన్నారు. ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నాయకులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశస్థాయిలో ఉండే రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి సారించాయని.. కేసీఆర్ ఎదుగుదల తెలంగాణ ప్రజల ఎదుగుదల అని అన్నారు. వరంగల్ జిల్లాకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని.. మా బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఎప్పుడు ప్రారంభిస్తారు..? వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతారు..? అని బీజేపీని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ కాదా..? అని అడిగారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- harish rao
- khammam
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!