Atrocious: ఆస్తికోసం తల్లి అంతక్రియలు ఆపేసిన కొడుకు.. మూడు రోజులుగా ఫ్రీజర్ లోనే డెడ్ బాడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: మానవ సంబంధాలు రానురాను మరింత పలుచబారుతున్నాయి. ఆస్తి కోసమే బందాలను గుర్తు చేసుకుంటున్న రోజులు వచ్చాయి. కల్లముందే తల్లి చనిపోయిందనే బాధ కంటే.. ఆస్తి పంచకుండా వెళ్లిపోయిందనే బాధపడే పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నారు. కని పెంచిన తల్లి రేపటి నుంచి మన కళ్ల ముందు ఉండదనే విషయాన్ని చాలా తేలిగ్గా జీర్ణించుకుంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎక్కడ తమకు దక్కకుండా పోతుందనే ఆవేదనతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచుకుని పిల్లలు పంచాయితీకి ఎక్కిన వింత ఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది.
Read also: Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read
ఏం జరిగింది..?
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెం లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓ కుమారుడు చాలా కాలం క్రితమే మృతి చెందగా.. కూతుళ్ళ వద్దే ఉంటుంది లక్ష్మమ్మ. వీరి కోసం బాగానే ఆస్తులు సంపాదించింది. అయితే ఈ ఆస్తులే ఆమె అంత్యక్రియలకు అడ్డుగా మారాయి. కొద్దిరోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు జారీ పడింది. దీంతో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితమే మృతి చెందింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతుళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్య వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు దీంతో లక్ష్మమ్మ వద్ద ఉన్న 21 లక్షల రూపాయల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు ఖర్చు చేయగా మిగిలిన 15 లక్షల రూపాయలను కొడుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. పంపకాలు సమానంగా.. సమస్య లేకుండా ముగిసినా.. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రీ పెట్టడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.
Read also: Potholed Roads: రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలే..
అంత్యక్రియలకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలని… అలా జరిగితేనే తలకొరివి పెడతామని తేల్చి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో అంతక్రియల ఖర్చు వివాదం తల్లి అంత్యక్రియలు నిలిచిపోయేలా చేసింది. అంత్యక్రియల ఖర్చు పంచాయతీ కొడుకు, కుమార్తెల మధ్య గొడవకు కారణమైంది.. దీంతో అంత్యక్రియలు ఆగిపోగా ఫ్రీజర్ లోనే లక్ష్మమ్మ మృతదేహం ఉండిపోయింది. కన్న బిడ్డల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీని ఇంకా అంత్యక్రియలు జరపకుండా ఇంటి వద్ద ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మమ్మ బతికున్నప్పుడు బాగానే ఉందని ఎవరితోనూ మాట పడేది కాదని, కానీ ఇప్పుడు ఆమె అంత్యక్రియలు కూతుర్లు, కొడుకు వల్లే ఆగిపోవడం బాధగా వుందని తెలిపారు. పెద్దవారు ఎవరైనా వచ్చి లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిపించాలని కోరుతున్నారు.
Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. మూణ్నెళ్ల తర్వాత…
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!