Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: కొన్ని రోజులు కురుస్తున్న వాలతో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో కురిసిన వర్షానికి ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అంటే శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు.
Read also: Potholed Roads: రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలే..
Also Read
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 – 50 కి.మీ. వేగంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరిలో మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. మూణ్నెళ్ల తర్వాత…
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సూచించారు. మండలాల వారీగా వర్ష సూచనను డీఆర్ఎఫ్ఎక్స్ ఖాతా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వరద నీరు నిలిచినా, చెట్లు కూలినా, కొమ్మలు విరిగిపోయినా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040-21111111, డీఆర్ఎఫ్ నంబర్ 9000113667కు ఫోన్ చేయాలని సూచించారు.
Read also: Telangana Rains: రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. దిక్కుతోచని స్థితిలో రైతన్న
సాయంత్రం 4.40 నుంచి 6 గంటల వరకు, 6 తర్వాత వర్షం తగ్గే అవకాశం ఉందని సూచించారు. సాయంత్రం మరో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని షిఫ్ట్ టైమింగ్ మార్చుకోవాలని కోరింది. వర్షం సమయంలో బయటకు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. వర్షం కురిస్తే ట్రాఫిక్కు అంతరాయం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని జీహెచ్ఎంసీ సూచిస్తోంది.
Telangana: అలర్ట్.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్
తాజావార్తలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!