Terrible incident: పైసలు కోసం కన్న తల్లిని పైశాచికంగా చంపాడు
Terrible incident: తెలంగాణలోని గద్వాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో కన్నతల్లి అని కూడా చూడకుండా నరికి చంపాడు కొడుకు. తన తండ్రిపై కొడుకు దాడి చేస్తుంటూ ఆపడమే తల్లి చేసిన నేరం. ఆవేశంతో విచక్షణ మరిచి అదే గొడ్డలితో తల్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో వెలుగు చూసింది. హరిజన నాగమ్మ (60), రాముడు దంపతులు. వీరు రామాపురంలో నివాసం ఉంటున్నారు.
Read also: Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు మొత్తం ఏడుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు వారి సంసారాలతో బిజీగా ఉన్నారు. వీరిలో మూడో కొడుకు ప్రేమ్ రాజ్ ది లవ్ మ్యారేజ్. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని నగరంలో ఉంటున్నాడు. పది రోజుల క్రితం ప్రేమ్ రాజ్ రామాపురం వచ్చాడు. 10 రోజుల తర్వాత భార్య వద్దకు తిరిగి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులిద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. తమ వద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు.
వారిపై కోపంతో ప్రేమ్ రాజ్ శుక్రవారం ఇంటి ముందు ఉన్న చెట్టును గొడ్డలితో నరుకుతుండగా..ప్రేమ్ రాజ్ తండ్రి అభ్యంతరం తెలిపారు. దాంతో ప్రేమ్ రాజ్ అదే గొడ్డలితో తండ్రిపై దాడికి దిగాడు. అది గమనించిన తల్లి కొడుకును అడ్డుకుంది. దీంతో ప్రేమ్ రాజుకు కోపం వచ్చింది. తండ్రిపై చేయాలనుకున్న దాడి తల్లిపై చేశాడు. చేతిలోని గొడ్డలితో తల్లిని విచక్షణారహితంగా నాలుగుసార్లు కొట్టాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులందరూ నిందితుడు పారిపోకుండా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతోనే తన కొడుకు ప్రేమ్ రాజ్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతని తండ్రి రామ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి హరిజన నాగమ్మ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!