Terrible incident: పైసలు కోసం కన్న తల్లిని పైశాచికంగా చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible incident: తెలంగాణలోని గద్వాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో కన్నతల్లి అని కూడా చూడకుండా నరికి చంపాడు కొడుకు. తన తండ్రిపై కొడుకు దాడి చేస్తుంటూ ఆపడమే తల్లి చేసిన నేరం. ఆవేశంతో విచక్షణ మరిచి అదే గొడ్డలితో తల్లి తలపై కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో వెలుగు చూసింది. హరిజన నాగమ్మ (60), రాముడు దంపతులు. వీరు రామాపురంలో నివాసం ఉంటున్నారు.
Read also: Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు మొత్తం ఏడుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు వారి సంసారాలతో బిజీగా ఉన్నారు. వీరిలో మూడో కొడుకు ప్రేమ్ రాజ్ ది లవ్ మ్యారేజ్. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని నగరంలో ఉంటున్నాడు. పది రోజుల క్రితం ప్రేమ్ రాజ్ రామాపురం వచ్చాడు. 10 రోజుల తర్వాత భార్య వద్దకు తిరిగి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులిద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. తమ వద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు.
వారిపై కోపంతో ప్రేమ్ రాజ్ శుక్రవారం ఇంటి ముందు ఉన్న చెట్టును గొడ్డలితో నరుకుతుండగా..ప్రేమ్ రాజ్ తండ్రి అభ్యంతరం తెలిపారు. దాంతో ప్రేమ్ రాజ్ అదే గొడ్డలితో తండ్రిపై దాడికి దిగాడు. అది గమనించిన తల్లి కొడుకును అడ్డుకుంది. దీంతో ప్రేమ్ రాజుకు కోపం వచ్చింది. తండ్రిపై చేయాలనుకున్న దాడి తల్లిపై చేశాడు. చేతిలోని గొడ్డలితో తల్లిని విచక్షణారహితంగా నాలుగుసార్లు కొట్టాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులందరూ నిందితుడు పారిపోకుండా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతోనే తన కొడుకు ప్రేమ్ రాజ్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతని తండ్రి రామ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి హరిజన నాగమ్మ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!