Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry: భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ గృహిని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం రోజు వేధించిన భరించింది. కన్నబిడ్డను కోసం బాధలన్నీ భరిస్తూ వచ్చింది. చివరకు సహనం కోల్పోయిన ఆమె బలావన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది.
Read also: MS Dhoni : ప్లీజ్ ధోని.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవొద్దు.. మహీకి పైలెట్ రిక్వెస్ట్
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రత్నదీప్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక లోని బీదర్ జిల్లాకు చెందిన నందినీతో తనకు వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వారికి ఒక చిన్న బాబుకూడా వున్నాడు. అనోన్యంగా సాగుతున్న వారి కాపురంలో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. అయినా భరిస్తూ తన చిన్నారి కొడుకోసం బతుకుతూ వచ్చింది. కానీ డబ్బులకోసం వేధింపులు తీవ్రంగా మారాయి. డబ్బులు తీసుకురావాలని కర్కసంగా వేధించారు భర్త, అత్తమామలు అది భరించలేక పోయింది నందిని. చివరకు చావే సరన్యమని భావించింది నందిని. తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ నందిని బయటకు రావకపోవడంతో భర్త గది వైపు వెళ్లి చూడగా నందిని ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది. దీంతో భర్త తన తల్లిదండ్రులకు చెప్పగా.. కనీకరంలేని రత్నదీప్ తల్లిదండ్రులతో నీ అత్తమామలకు చెప్పి నందిని శవాన్ని తీసుకుని వెళ్లమని చెప్పమన్నారు.
Read also: Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..
తల్లిదండ్రులను చెప్పినట్టే రత్నదీప్ నందిని పేరెంట్స్ కు కాల్ చేసి మీ బిడ్డ నందిని చనిపోయింది వచ్చి సవాన్ని తీసుకుని వెళ్లండి అని చెప్పాడు. దీంతో నిర్ఘాంతపోయిన నందిని తల్లిదండ్రులు హుటాహుటిని హైదరాబాద్ కు వచ్చారు. నందిని విగత జీవితగా పడిఉండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. తమ బిడ్డను చిత్ర హింసలు పెట్టి భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ నందినీ పేరెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఒంటి పై గాయాలు ఉన్నాయని, అతి దారుణంగా నా బిడ్డను కొట్టి చంపేసారని కన్నీరుమున్నీరయ్యారు. గత కొన్న రోజులుగా అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు చేస్తున్నారని నందిని ఫోన్ చేసి తన బాధను చెప్పుకుందని వాపోయారు. సరే మేము వచ్చి మాట్లాడుతామని నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్పామని ఇంతలోనే నీ బిడ్డ చనిపోయింది వచ్చి శవాన్ని తీసుకొని వెళ్లండంటూ అల్లడు ఫోన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నందిని తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త రత్నదీప్ అరెస్ట్ చేయగా.. అత్తమామ విజయ, లక్ష్మన్ రావు పరారీలో వున్నారు. తమ బిడ్డను చంపడమే కాకుండా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే చంపుతామంటూ కాల్స్ చేస్తున్నారంటూ నందిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..