Ponguleti: పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్కేస్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు నేటితో ముగిసాయి. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక రూమ్ లాక్ చేసి ఉండడంతో కీస్ తీయకుని రావాలని పొంగులేటి భార్యకు ఐటీ అధికారులు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి కీస్ తీసుకురాలేకపోవడంతో డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి సోదాలు జరిపారు.
పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజుల వరకు ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. అయితే దీనిపై ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. నాలుగు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా పది చోట్ల ఐటీ దాడులు సాగుతూనే ఉన్నాయి.. సెంట్రల్, స్టేట్ ఎన్నికల కమిషన్ లకు ఫిర్యాదు చేశాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలకు సపోర్టు ఉందా అని పిస్తోంది.. ఎన్నికల కమిషన్ బ్యాలెన్స్ తప్పుతున్నారా లేక అధికారం ఒత్తిడికి లోంగుతున్న రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మీదనే దాడులు జరుగుతున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ సంబందం ఉంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
తుమ్మల ఇంట్లో తనిఖీల్లో ఏమి లభించలేదు.. నా ఇంట్లో ఐటీ సోదాల్లో వారికి ఏమి దొరకలేదు.. నా అల్లుడు మీద దురుసుగా ప్రవర్తించారు.. నా ఉద్యోగి జయ ప్రకాష్ నీ కొట్టారు.. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు.. వంటి కాలు మీద చైర్ లో నిలబెట్టారు.. ఒప్పుకోవాలని బలవంతం చేశారు అని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దీని వెనుక కారణాలు ఏమిటి.. మ్యాన్ హ్యాండిలింగ్ చేసే హక్కు ఎవ్వరూ ఇచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్ములను ఎవ్వరూ పంపించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగారు. వారి కోసం మీరు చేసే పద్ధతులు సరికాదు.. తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకుంటాము.. జైళ్లలో పెడతమని బెదిరించారు.. అధికారులు మీరు హద్దుల్లో ఉండాలి.. ఐటీ రూల్స్ అందరికీ తెలుసు, అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలికితే చాలు అన్నట్లుగా ఉన్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
Israel PM: గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం మాకు లేదు..
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం