Gokul Chat Bomb Blast: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు.. దోషులకు పదేళ్ల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gokul Chat Bomb Blast: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఒబేదుర్ రెహమాన్తో పాటు ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ఖాన్లకు ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. గతంలో వివిధ పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న దోషులు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడి గందరగోళం సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఈ నిషేధిత సంస్థ తరపున పనిచేస్తున్న ఈ నలుగురు సానుభూతిపరులు పేలుళ్ల కుట్రలో భాగమేనన్నారు. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నలుగురి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ రుజువు చేసింది. వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో వీరి పాత్ర ఉందని చెప్పారు. తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించారు.
Read also: Burj Khalifa Dosa: బుర్జ్ ఖలీఫా దోశ తిన్నారో వావ్ అనాల్సిందే !
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ఆగస్ట్ 25, 2007న కోఠిలోని గోకుల్ చాట్ మరియు లుంబినీ పార్క్ వద్ద ముఠా బాంబు దాడులు చేసింది. ఈ క్రూరమైన మారణకాండలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. లుంబినీ పార్క్ పేలుడులో 9 మంది మృతి.. గోకుల్ చాట్ షాపు పేలుడులో 33 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరు వికలాంగులు మరియు ఇప్పటికీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్తో పాటు బస్టాండ్లో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేయగా.. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అప్పట్లో అరెస్ట్ చేసింది.
Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..