Hyderabad: హైకోర్టులో లుంబినీ పార్క్, గోకుల్చాట్ పేలుళ్ల కేసు విచారణకు వచ్చింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని నేరస్థులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై హైకోర్టు ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. కేసు విచారణను మరో బెంచ్కు మార్చాలన్న నేరస్థుల లాయర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి.