మేడారం జాతర పనులను వేగవంతం చేయాలి: ఇంద్రకరణ్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గత జాతరలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకెడ్ల ఏర్పాటుకు పత్యేకంగా చూడాలన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ వేరింయట్లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, స్నాన ఘట్టాల వద్ద అన్నిఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also:ఏపీ, తెలంగాణకు కేంద్రం లేఖ.. విభజన సమస్యలపై చర్చిద్దాం రండి..
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
రహదారుల వెంట ఆర్అండ్బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, పార్కింగ్కుఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. పోలీసులు సీసీ కెమెరాలతో జాతర పనులను పర్యవేక్షించాలన్నారు. జాతర అనంతరం చెత్తతొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్ని పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అంతకముందు మంత్రులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!