IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. ఈనెల 22న విచారణకు రావల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్ గా సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్ఎస్ నేతల నివాసాలు, వ్యాపారాల నుంచి అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి కంచర్ల రామా కృష్ణ రెడ్డితో పైళ్ల శేఖర్ రెడ్డి సమావేశమయ్యారు.
అనంతరం పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ నా నివాసంలో గంటన్నర పాటు సోదాలు జరిగాయని తెలిపారు. కావాలనే ముడు రోజుల పాటు ఐ.టి అధికారులు కాలయాపన చేశారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఐ.టి అధికారుల తీరు ఉందని అన్నారు. ఇంకా ఏమన్నా దొరుకుతుందా అన్న దానిపై సోదాలు జరిగాయని తెలిపారు. నా నివాసంలో ఏం కనిపించలేదని అన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, నా సతీమణి బెంగుళూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని స్పష్టం చేశారు. దానికి సంబందించిన డాక్యుమెట్స్ తీసుకున్నారుని తెలిపారు. ఆదాయ పన్ను చెలిస్తున్ననని స్పష్టం చేశారు. కావాలనే నా పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఐ.టి సోదాలు వెనుక ఏ పార్టీ హస్త ఉందో అందరికి తెలుసని మండిపడ్డారు. నాకు ఈనెల 22న గురువారం రమ్మని ఐ.టి అధికారులు నోటీసులు అందజేసారని తెలిపారు. నేను నిజాయితీగా ఉన్నారని, నా నియేజకవర్గం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also Read
ఐ.టి సోదాలు తరువాత నాకు అధిష్ఠానం నుండి అధ్యక్షుల నుండి పార్టీ నుండి ఎలాంటి కాల్స్ రాలేదని అన్నారు. గత మూడు రోజులుగా నాపై కుట్ర పూరితంగానే IT రైడ్స్ జరిగాయని అన్నారు. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని తెలిపారు. IT రైడ్స్ మొదటి రోజే ఒక గంటన్నర లోనే పూర్తి అయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నది అవాస్తవం మని తెలిపారు. 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని, IT అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారని అన్నారు. నాకోసం మూడు రోజులుగా ఇక్కడే వున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం పోతే.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!