బీజేపీ నాయకురాలు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు హై కోర్టులో ఊరట లభించింది. బొడిగె శోభను రూ. 25 వేల పూచీకత్తుతో విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదీలీ విషయంలో ఉన్న జీవో నెంబర్ 317 ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మందిని కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: రాజీవ్గాంధీ భద్రతా సిబ్బందిని నిందించలేదు: రేవంత్రెడ్డి
అంతే కాకుండా జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇటీవల బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. తాజాగా బొడిగె శోభ కూడా తన రిమాండ్ను రద్దు చేయాలని హై కోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హై కోర్టు విచారించింది. బొడిగే శోభ రిమాండ్ పై స్టే విధించింది. అలాగే బొడిగె శోభ అరెస్టు గురించి పూర్తి వివరాలు హై కోర్టుకు సమర్పించాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను వచ్చే నెల 7 తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.