బీజేపీ నాయకురాలు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు హై కోర్టులో ఊరట లభించింది. బొడిగె శోభను రూ. 25 వేల పూచీకత్తుతో విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదీలీ విషయంలో ఉన్న జీవో నెంబర్ 317 ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మందిని…
బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, అరెస్టులపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై ఇంతకముందే బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో చెప్పాలని కిషన్రెడ్డి అన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.టీఆర్ఎస్ నేతల కోవిడ్ ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనల మేరకే బండి సంజయ్ దీక్ష చేశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.…
బండిసంజయ్ అరెస్టు పై బీజేపీఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ ..కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డిసెంబర్ 25న కోవిడ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు తరవాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు… మాస్క్ లేదు.. వేల మంది హాజరయ్యారన్నారు. ఆ తర్వాత ktr నల్గొండ జిల్లాకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్కు మాస్క్ లేదు. నిన్న కరీంనగర్లో గంగుల కమలాకర్ ప్రెస్మీట్ పెట్టాడు మాస్క్ లేదు. వీరికి…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండో ఎఫ్ఐఆర్ ఆధారంగా సంజయ్కు కోర్టు రిమాండ్ విధించింది. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ వేయనున్నారు బండి…
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. బీజేపీని అడ్డుకోవడానికి, ఉద్యమాలను అణచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు బీజేపీ నాయకురాలు విజయ శాంతి. మమ్మల్ని చంపినా..4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమం చేస్తామని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ను గద్డె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, 317 జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫామ్ హౌజులో కూర్చోని రాత్రికిరాత్రి జీవోలు తీసుకువస్తున్నారని విమర్శించారు. పోలీసులు…
ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్కు ఇనుపకంచెలు, ఫాంహౌస్కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన…
కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు. డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి…