TG To Replace TS: ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం..!
TG To Replace TS: తెలంగాణలో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’ కనిపించనుంది. కొత్తగా రిజిస్టరైన వాహనాలన్నీ ‘టీజీ’ పేరుతో రిజిస్టర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలైంది. ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత దీనికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటిపైనా ‘టీఎస్’ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రం ఆవిర్భవించకముందే కొత్తగా వచ్చిన దానిలో ‘టీజీ’ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ‘టీఎస్’ అనే అక్షరాలను ‘తెలంగాణ రాష్ట్రం’ అని అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేసేందుకు అనధికారికంగా తమ వాహనాలకు ‘టీజీ’ నంబర్ ప్లేట్లను పెట్టుకున్నారు.
Read also: Nirmal Handicrafts: ఆదరణ కోల్పోతున్న నిర్మల్ కొయ్య బొమ్మలు..కళాకారుల ఆవేదన
Also Read
- TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను క్లుప్తంగా ‘ఏపీ’ అని పిలిచేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ పేరు కొనసాగింది. కానీ ఉద్యమ సమయంలో కూడా చాలా మంది తెలంగాణను ‘టీజీ’ అని సంబోధించేవారు. విడిపోయాక అదే పేరుతో పిలుస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ రాష్ట్రం పేరు చిన్నది కాబట్టి దీనిని ‘తెలంగాణ’ అని పిలుస్తారు. అయితే వాహనాలపై కూడా ‘టీజీ’ ఉంటుందని భావిస్తే.. అధికారికంగా ‘టీఎస్’గా మారిపోయింది. కానీ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో మళ్లీ ‘టీజీ’ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన మరో రెండు హామీల అమలుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ హామీలలో మహాలక్ష్మి హామీలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారెంటీ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటి అమలుకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు వైరల్..!
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
-
Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!