Nirmal Handicrafts: ఆదరణ కోల్పోతున్న నిర్మల్ కొయ్య బొమ్మలు..కళాకారుల ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal Handicrafts: నిర్మల్ కోయ బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా చేరుతున్నాయి. ఆన్లైన్ దిగ్గజం అమెజాన్లో ఈ బొమ్మలను అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో కోయ బొమ్మలు తయారు చేస్తున్న వారికి ఈ రూపంలో ఓ భరోసా లభించింది. అయితే.. అటువంటి ప్రసిద్ధ కళాఖండాలను రూపొందించడానికి కర్రలు కొరతగా మారుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో లభించే పోనికి కర్ర, చింత గింజల పొడితో ఈ కళాఖండాలను తయారుచేస్తున్నారని, అయితే అడవుల్లో ఈ చెట్లు తగ్గిపోవడంతో ప్రస్తుతం కర్ర అందుబాటులో లేదని స్థానిక కళాకారులు చెబుతున్నారు. కొన్నిసార్లు వారే స్వయంగా అడవుల్లో చెట్లను వెతికి అటవీశాఖ సమాచారం ఇచ్చి టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
Read also: Ladakh : నాలుగు డిమాండ్లతో లడఖ్ లో రోడ్లపైకి వచ్చిన వేలాదిమంది జనాలు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
అటవీ మైదానంలో ప్లాంటేషన్ ద్వారా డిమాండ్ ఉన్న చెరుకును పెంచేందుకు అటవీశాఖ మూడేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అటవీ శాఖ సీసీఎఫ్ శరవణన్ పోని చెట్లను పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇంత చరిత్ర కలిగిన చెక్క బొమ్మల తయారీ కేంద్రం పరిస్థితి భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుందని స్థానిక చేతివృత్తుల వారు వాపోతున్నారు. పరిస్థితిని తట్టుకుని నిలబడలేకపోతున్నారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం చేతితో చేసే కళా వృత్తి తమ చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఈ వృత్తిని నేర్చుకోలేకపోతున్నారని, ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నరని, ఈ వృత్తి తాము ఉన్నంత వరకే సాగుతుందేమోనని భయపడుతున్నారు. గతంలో దాదాపు 200కు పైగా కుటుంబాలు ఈ వృత్తిని చేపట్టేవారని, ఇప్పుడు అది పదుల సంఖ్యలో చేరిందన్నారు. ఇలాగే కొనసాగితే మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఈ వృత్తి కొనసాగే అవకాశం ఉంది.
Read also: CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు వైరల్..!
17వ శతాబ్దంలో నిర్మల్ రాజ్యాన్ని పరిపాలించిన నిర్మల నాయుడు దేశం నలుమూలల నుండి అనేక మంది కళాకారులను రప్పించి రాజ్యంలో అనేక స్థానిక నిర్మాణాలు చేయగా అందులో నకశీలలు భాగమయ్యారు. ఈ నకాషి కులానికి చెందిన వారు స్థానికంగా లభించే పోనికి కర్రతో వివిధ కళాఖండాలను తయారు చేస్తారు. నిమ్మల రాజు ఈ శిథిలాలను చూసి మంత్రముగ్ధుడై వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుండి వారి హస్తకళ వివిధ ప్రాంతాలకు విస్తరించింది.. 1955 లో కళాఖండాలను వివిధ ప్రాంతాలకు పంపి ఉపాధి పొందేందుకు ఒక పారిశ్రామిక సంఘం ఏర్పడింది. అయితే..ఇప్పుడు 400 ఏళ్లనాటి కోయ బొమ్మల తయారీ పరిశ్రమకు ఆదరణ లేక కుంటుపడుతుందని స్థానిక కళాకారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్జీఎల్ ఎండీగా..!
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!