Bhatti Vikramarka : రాయలసీమ లిఫ్ట్ను ఆపేయాలి.. అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుంది
- రాయలసీమలో లిఫ్ట్ పూర్తి అయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ నష్టం
- రాయలసీమ లిఫ్ట్ను ఆపేయాలి
- కృష్ణా జలాలను తెలంగాణ 1 టీఎంసీ వాడుకుంటే.. ఏపీ 11 టీఎంసీలు వాడుకుంటోంది
- అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుంది
- సీఎం రేవంత్, ఉత్తమ్ ఇద్దరూ బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు
- అందుకే బనకచర్ల ఆగిపోయింది. -భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని ఏరు దాటుతున్నా, ఆ నీరు వృథా అవుతోంది. ఉద్యమాల సమయంలో ఇది చేయలేకపోయాం, కానీ పదేళ్ల TRS పాలనలో ఒక్క చుక్క నీటినీ సద్వినియోగం చేయలేదన్నారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
Mahavatar : ఇంట్లో కూర్చొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు – దర్శకుడు అశ్విన్ కుమార్
ఉమ్మడి రాష్ట్ర కాలంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ముఖ్యంగా జలిముడి ప్రాజెక్ట్ పట్ల BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆయన విమర్శించారు. దయలేని BRS పాలన తర్వాత, ఇంద్రమ్మ రాజ్యం రాగానే ఈ పథకానికి మోక్షం లభించింది. మూడో జోన్లో 35 వేల ఎకరాలకు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.
అంతేకాకుండా.. సాగర్ మూడో జోన్ మొత్తం రెండో జోన్లో కలిసేలా రూపకల్పన చేస్తున్నాం. ఖమ్మం జిల్లా మొత్తం సాగర్ నీటిపైనే ఆధారపడి ఉంది. మనం కేవలం 1 TMC కృష్ణా నీటిని వాడుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ వారు 11 TMCల నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
బనకచర్ల ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా సీఎం రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి పోరాడి ఆ ప్రాజెక్ట్ను ఆపారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ, దానిని ఆపేందుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ముంపు భూములను తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్ట్ను అంగీకరించబోం. యావత్ కేబినెట్ బనకచర్ల వ్యతిరేక పోరాటంలో ముందుంటుంది అని స్పష్టం చేశారు.
జవహార్ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే, మధిర నియోజకవర్గ రైతులకు సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని, పంటల ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా రైతులు లాభపడతారని తెలిపారు.
MLC Kavitha: కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే..
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!