Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందా?
- 42% బీసీ రిజర్వేషన్లు.. కాంగ్రెస్ హామీ చర్చలోకి
- హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు పార్టీ-స్థాయి రిజర్వేషన్లతో కాంగ్రెస్ కొత్త వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. అయితే, ఈ హామీని అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీఓ (GO)పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉండడంతో, అధికారికంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాని పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన నేపథ్యంలో, న్యాయపరమైన చిక్కులను అధిగమించకుండా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే, కోర్టు స్టే ఉన్నప్పటికీ, డిసెంబర్ రెండవ వారం నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
Also Read
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
- Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
- Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
న్యాయపరమైన అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీ సింబల్ ఉండదు. అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులుగానే బరిలోకి దిగుతారు. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, కాంగ్రెస్ పార్టీ 42% సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ, జిల్లాల వారీగా ఈ పార్టీ-స్థాయి రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశించారు.
మరోవైపు, అధికారికంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ బీసీ సంఘాలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. అధికారికంగా రిజర్వేషన్లు ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తో గాంధీ భవన్ ముందు వరకు ఆందోళనలు నిర్వహించిన సంఘాలు, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ZPTC, MPTC ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. హైకోర్టులో తన వాదనలను వినిపించి, కోర్టు గడువులోపు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చిన తర్వాతే MPTC, ZPTC ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ కోర్టులో అధికారికంగా రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా, పార్టీ తరపున 42% సీట్లు బీసీలకు ఇవ్వాలనే తన నిర్ణయాన్ని కాంగ్రెస్ కొనసాగించాలని తీర్మానించుకుంది. మొత్తం మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం న్యాయపరమైన సవాళ్లు , రాజకీయ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
-
Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!