Telangana Rising Global Summit : రంగంలోకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్.. డ్రోన్ కెమెరాలతో నిఘా
- HYD: రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్కు భారీ బందోబస్తు
- 6 వేల మందితో భారీ బందోబస్తు
- ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి వేదిక వరకు బందోబస్తు
- ఇప్పటికే ప్రజా వేదికను ఆధీనంలో తీసుకున్నాం
- సమ్మిట్కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతిస్తాం. -రాచకొండ సీపీ సుధీర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rising Global Summit : హైదరాబాద్లో జరగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్కు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సమ్మిట్ను సురక్షితంగా నిర్వహించేందుకు దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ ప్రధాన వేదిక వరకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు.
సమ్మిట్ వేదికను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. సమ్మిట్కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా లోటు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
భద్రతా చర్యలలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. ప్రధాన ప్రాంగణం పూర్తిగా ఆక్టోపస్ ఆధీనంలో ఉండనుండగా, ప్రధాన వేదికతో పాటు ఇతర ప్రాంగణాల్లోనూ విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్లతో గాలింపులు నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ గ్లోబల్ సమ్మిట్కు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రధాన వేదిక వరకు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన వేదిక చుట్టూ నలువైపులా ప్రత్యేక డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అధునాతన కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వందలాది సీసీ కెమెరాల ద్వారా సమ్మిట్ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటల పాటు నిఘా కొనసాగించనున్నారు. ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలతో పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..