Telangana Rains: రెండ్రోజుల పాటు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోతున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Read also: Hyderabad: ముసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవాహం.. సమీప కాలనీల్లో టెన్షన్ టెన్షన్
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తుపాను వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా. 29న ములుగ, సిద్దిపేట, భద్రాద్రి కోశిగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెరియపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, కొమరం భీం, ఆదిలాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన వాతావరణ బులెటిన్లో పేర్కొంది. వికారాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సంభవిస్తుంది.
Read also: Tomato: Paytm, ONDC ద్వారా టమాటాలు ఉచిత డెలివరీ.. కండీషన్స్ అప్లై..!
నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలో 620.4, రేగొండలో 475.4, మొగుళ్లపల్లెలో 430.6, హనుమకొండ జిల్లా పర్కల్లో 459.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాపల్లి జిల్లాలో 301.4, కరీంనగర్ జిల్లాలో 184.2, మహబూబాబాద్ జిల్లాలో 176.9, ములుగు జిల్లాలో 168.2, జనగాం జిల్లాలో 139.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Godavari Flood: వరదలో చిక్కుకున్న లంక గ్రామలు.. నీట మునిగిన కాజ్ వేలు, రాకపోకలు బంద్..
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!