Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahmood Ali: దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా C.A.P. సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనికుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, రోనాల్డ్ రోస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ,విద్యాశాఖ సెక్రెటరీ కరుణ, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని, కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని తెలిపారు. పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. టెక్నాలజీ పెరిగింది.. దీంతో పాటు సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ప్రజల కోసం పొలీసులు నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాల నియంత్రణ కోసం పని చేస్తారని, సైబర్ అంబాసిడర్స్ కు సైబర్ కంట్రోల్ బాధ్యత ఉందని హోంమంత్రి తెలిపారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని మహమూద్ అలీ తెలిపారు.
Read also: Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం
Also Read
ఇక డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. పెట్రోల్ వెహికిల్స్ లాగా సైబర్ పెట్రోల్ వచ్చిందని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ లో ముందు ఉండాలని తెలిపారు. సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా.. డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీ లో ముందు ఉండాలని తెలిపారు. రోనాల్డ్ రోస్.. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రెటరీ విద్యాశాఖ సెక్రెటరీ కరుణ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ స్కూల్ లో ఈ సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి స్కూల్ నుంచి 4 గురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. వాళ్లు ఆ స్కూల్స్ లో అందరికి సైబర్ నేరాలపై అవగాహన ల్పించి, అప్రమత్తం చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు తగ్గేవిదంగా కృషి చేయాలన్నారు. 380 స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
Telangana CS: తెలంగాణ నెక్ట్స్ సీఎస్ ఎవరు?.. రేసులో ఆ నలుగురు ?
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!