Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Police Has Given Special Focus On Real Estate Frauds

Real Estate Frauds: రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. ఇక నుంచి అలాంటివి చేస్తే జైలుకే..!

Published Date :February 5, 2024 , 10:56 am
By Bhanu
Real Estate Frauds: రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. ఇక నుంచి అలాంటివి చేస్తే జైలుకే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Real Estate Frauds: సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి సామాన్యుడి కల. అందుకోసం రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. వారికి వస్తున్న తమ బడ్జెట్‌లో స్థలమో, ఇళ్లో తీసుకోవాలని భావిస్తారు. అయితే ఇదే అదునుగా భావించి రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రీ-లాంఛింగ్ ఆఫర్ల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేసి.. డబ్బులు తీసుకుని ఫ్లాట్లు ఇప్పిస్తానని నటిస్తూ ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ఒక్క హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నమోదైన రియల్ ఎస్టేట్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చించి ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలు చేసిన వారు మోసగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వం స్పందించింది. రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీసుకుంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్రీ-లాంచింగ్ ఆఫర్ల పేరుతో కనీసం వంద వెంచర్లు ఉంటాయని అంచనా. భూ యజమానులతో అగ్రిమెంట్ చేసుకుని.. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు తెస్తున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి నంబబలికి సామాన్యుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్నారు.

Read also: Tollywood Movies: ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

Also Read

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
Add as a preferred
source on google

భూ యజమానికి పెట్టె కట్టి, ఆ తర్వాత అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా.. భూ యజమానితో వివాదం వచ్చినా ప్రాజెక్టు ఆగిపోయి.. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని పోలీస్ స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు పది శాతం భూ వివాదాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రియల్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని వ్యాపారులు వివిధ మార్గాల్లో ఇతర సంస్థల్లోకి మళ్లిస్తున్నారు. ఇదంతా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీని రంగంలోకి దింపుతోంది. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఈడీకి పంపించారు. నిధుల మళ్లింపుపై విచారణ ప్రారంభించిన ఈడీ.. ఇప్పటికే సాహిత్య సంస్థ ఆస్తులను జప్తు చేసింది. త్వరలో ఇతర కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఐటీ శాఖకు కూడా సమాచారం అందించారు. శాఖ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీసులు త్వరలో ఈడీ, ఐటీ అధికారులతో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.
Pakistan : పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది పోలీసులు మృతి, ఆరుగురికి గాయాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad real estate frauds
  • real estate frauds
  • real estate frauds in telangana
  • Telangana police

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions