Real Estate Frauds: రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. ఇక నుంచి అలాంటివి చేస్తే జైలుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Estate Frauds: సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి సామాన్యుడి కల. అందుకోసం రాత్రింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. వారికి వస్తున్న తమ బడ్జెట్లో స్థలమో, ఇళ్లో తీసుకోవాలని భావిస్తారు. అయితే ఇదే అదునుగా భావించి రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రీ-లాంఛింగ్ ఆఫర్ల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేసి.. డబ్బులు తీసుకుని ఫ్లాట్లు ఇప్పిస్తానని నటిస్తూ ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ఒక్క హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నమోదైన రియల్ ఎస్టేట్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చించి ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలు చేసిన వారు మోసగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వం స్పందించింది. రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీసుకుంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్రీ-లాంచింగ్ ఆఫర్ల పేరుతో కనీసం వంద వెంచర్లు ఉంటాయని అంచనా. భూ యజమానులతో అగ్రిమెంట్ చేసుకుని.. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులు తెస్తున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి నంబబలికి సామాన్యుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్నారు.
Read also: Tollywood Movies: ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
భూ యజమానికి పెట్టె కట్టి, ఆ తర్వాత అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా.. భూ యజమానితో వివాదం వచ్చినా ప్రాజెక్టు ఆగిపోయి.. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని పోలీస్ స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు పది శాతం భూ వివాదాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రియల్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని వ్యాపారులు వివిధ మార్గాల్లో ఇతర సంస్థల్లోకి మళ్లిస్తున్నారు. ఇదంతా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీని రంగంలోకి దింపుతోంది. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఈడీకి పంపించారు. నిధుల మళ్లింపుపై విచారణ ప్రారంభించిన ఈడీ.. ఇప్పటికే సాహిత్య సంస్థ ఆస్తులను జప్తు చేసింది. త్వరలో ఇతర కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఐటీ శాఖకు కూడా సమాచారం అందించారు. శాఖ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీసులు త్వరలో ఈడీ, ఐటీ అధికారులతో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.
Pakistan : పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది పోలీసులు మృతి, ఆరుగురికి గాయాలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!