Pakistan : పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది పోలీసులు మృతి, ఆరుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.. బలూచిస్థాన్లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల పేలుడు ఘటన ఇంకా చల్లారలేదు.. మరోసారి ఉగ్రవాదులు పాకిస్థాన్లో భీభత్సం సృష్టించారు. ఎన్నికలకు ముందు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. సీనియర్ పోలీసు అధికారి అనిసుల్ హసన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రదాడిలో పది మంది పోలీసులు మరణించగా, 6 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు.
Read Also:Virat Kohli: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం!
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని అధికారి తెలిపారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు మొదట స్నిపర్ షాట్లు పేల్చి చౌదవాన్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు హ్యాండ్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో స్వాబీ ఎలైట్ పోలీసు యూనిట్కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారని, ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో మోహరించినట్లు చెబుతున్నారు. దాడి తర్వాత ఇక్కడ యంత్రాంగం అప్రమత్తమైంది. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా, డేరా ఘాజీ ఖాన్కు వెళ్లే రహదారులపై భారీ శోధన ఆపరేషన్ నిర్వహించబడుతోంది. వచ్చే, వెళ్లే ప్రతి వ్యక్తిని నిశితంగా పరిశీలిస్తున్నారు. జూలై 4 ఆదివారం బలూచిస్తాన్లోని నుష్కీ జిల్లాలోని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే ఈసీపీ కార్యాలయం గేటు బయట జరిగిన పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నేరస్తులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also:Mark Zuckerberg : జుకర్బర్గ్ రికార్డు.. ఒక్కరోజులో రూ.2.33 లక్షల కోట్లు సంపాదన
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!