Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వ క్లారిటీ
- పానిక్ బాయింగ్తో పెరిగిన డిమాండ్
- భారీగా పెంచిన ఇంధన సరఫరా
- వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వ భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt Clarifies Petrol and Diesel Supply Situation Amid Shortage Rumors: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పెట్రోల్ , డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై పౌరసరఫరాల శాఖ స్పందిస్తూ వినియోగదారులకు స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఇంధన డిమాండ్ అకస్మాత్తుగా పెరగడానికి అనేక భౌగోళిక , ఆర్థిక కారణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం నిండుకోవడంతో (Dry-outs), ఆ ప్రభావం ఖమ్మం , మిర్యాలగూడ వంటి సరిహద్దు జిల్లాలపై పడింది. ఇదే తరహా పరిస్థితి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిర్మల్ జిల్లాలో కూడా తలెత్తింది. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజల్లో భయాందోళనలు (Panic buying) మొదలై రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంధన డిమాండ్ ఊహించని విధంగా పెరిగింది.
ఈ పరిస్థితికి మరో ప్రధాన కారణం పారిశ్రామిక , రిటైల్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. పారిశ్రామిక , వాణిజ్య అవసరాలకు వాడే డీజిల్ ధర ఏప్రిల్ 16, 2026 నాటి సవరణ ప్రకారం లీటరుకు రూ. 150 ఉండగా, రిటైల్ బంకుల్లో మాత్రం రూ. 95 కే లభిస్తోంది. ఈ రూ. 55 వ్యత్యాసం వల్ల వాణిజ్య వినియోగదారులు పెద్ద ఎత్తున రిటైల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వదంతులు రావడంతో ప్రజలు ముందుగానే ఇంధనాన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏప్రిల్ 25 నుంచి చమురు సంస్థలతో (OMCs) సమన్వయం చేసుకుంటూ సరఫరాను ముమ్మరం చేసింది.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన సరఫరా సాధారణం కంటే ఎంతో ఎక్కువగా జరుగుతోంది. ఏప్రిల్ 29 నాటికి అందిన గణాంకాల ప్రకారం, డీజిల్ పంపిణీ రోజువారీ సగటు 7,348 కేఎల్ నుంచి ఏకంగా 210 శాతం పెరిగి 22,782 కేఎల్కు చేరుకుంది. అదేవిధంగా పెట్రోల్ పంపిణీ కూడా సగటు కంటే 132 శాతం పెరిగి 13,622 కేఎల్గా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,536 అవుట్లెట్లకు 3,817 ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోంది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో “డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై కమిటీ”లను ఏర్పాటు చేయడంతో పాటు, పౌరసరఫరాలు, రెవెన్యూ , పోలీస్ అధికారులను బంకుల వద్ద నిఘా కోసం మోహరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా హార్వెస్టర్లు , రవాణా వాహనాలకు ఇంధనం సక్రమంగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కావున ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!