Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి.. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. టి.పీసీసీ అనుబంధ సంఘాల నేతలకు దిశా నిర్దేశం చేశారు రేవంత్రెడ్డి.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఇక, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని స్పష్టం చేశారు.. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రల నుంచి అప్రమత్తంగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు.. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన పీసీసీ చీఫ్.. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది.. అనుబంధ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Read Also: Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి.. పీఎస్ కుమారుడి ఆత్మహత్య.. అదే కారణమా…?
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
గాంధీ భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధ్యక్షులతో సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండ రెడ్డి, మల్లు రవి తదితరలు పాల్గొన్నారు.. ఈ సమావేశంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాగా, తాజాగా జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సారి బీజేపీ నుంచి పోటీచేశారు.. అయితే, ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో.. ఆ పార్టీ బరిలోకి దింపిన పాల్వాయి స్రవంతి.. మూడోస్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే.. సిట్టింగ్ స్థానంలో గట్టిపోటా ఇవ్వడం తర్వాత విషయం.. మూడోస్థానానికి పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!