Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి.. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. టి.పీసీసీ అనుబంధ సంఘాల నేతలకు దిశా నిర్దేశం చేశారు రేవంత్రెడ్డి.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఇక, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని స్పష్టం చేశారు.. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రల నుంచి అప్రమత్తంగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు.. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన పీసీసీ చీఫ్.. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది.. అనుబంధ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Read Also: Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి.. పీఎస్ కుమారుడి ఆత్మహత్య.. అదే కారణమా…?
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
గాంధీ భవన్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధ్యక్షులతో సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండ రెడ్డి, మల్లు రవి తదితరలు పాల్గొన్నారు.. ఈ సమావేశంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాగా, తాజాగా జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సారి బీజేపీ నుంచి పోటీచేశారు.. అయితే, ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో.. ఆ పార్టీ బరిలోకి దింపిన పాల్వాయి స్రవంతి.. మూడోస్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే.. సిట్టింగ్ స్థానంలో గట్టిపోటా ఇవ్వడం తర్వాత విషయం.. మూడోస్థానానికి పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!