Telangana new secretariat: సచివాలయం నలుదిక్కులా ద్వారాలు.. దేనిలోనుంచి ఎవరు వస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana new secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డా. బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్’ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఇవాల మధ్యాహ్నం 1:20 గంటలకు ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు.
సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిలో వాయువ్య ద్వారం అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల కదలికలు ఈశాన్య ద్వారం గుండా కొనసాగుతాయి. ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) ద్వారం సందర్శకుల కోసం ఉపయోగించబడుతుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు మరియు ముఖ్యమైన ఆహ్వానితులకు, దేశ, విదేశీ అతిథులకు మాత్రమే వినియోగిస్తారు.
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
Read also: Warangal Crime: ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లింది.. లైంగిక దాడికి గురైంది
బాహుబలి మహాద్వారాన్ని 29 అడుగుల వెడల్పు మరియు 24 అడుగుల ఎత్తుతో నాలుగు తలుపులతో నిర్మించారు. నాగ్పూర్లోని ఈ మహాద్వారాన్ని ఆదిలాబాద్ అడవుల్లోని టేకు చెక్కతో తయారు చేశారు. చెక్కపై ఇత్తడితో చెక్కారు. సచివాలయ ప్రాంగణం మొత్తం తలుపులన్నీ టేకుతో చేసినవే. తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్లకు భారీ గోపురాలున్నట్లే రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ గోపురాలు నిర్మించారు. 34 గోపురాలు మరియు సింహాల బొమ్మలు, జాతీయ చిహ్నం, కొత్త సచివాలయానికి కిరీటం. ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.
సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గోపురాలు నిర్మించారు. ప్రభుత్వ భవనాలు సహా ఆధునిక నిర్మాణాల్లో ఇంత భారీ గోపురాలు రూపొందించడం ఇదే తొలిసారి. ప్రతి గోపురం 82 అడుగుల ఎత్తు (సుమారు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇవి సచివాలయ భవన డిజైన్ ప్రకారం భవనానికి తూర్పు, పడమర వైపులా ఉన్నాయి. గోపురాల లోపలి భాగం స్కై లాంజ్ శైలిలో రూపొందించబడింది. ఇది దాని విశాలమైన కిటికీల నుండి చుట్టుపక్కల నగరం యొక్క వీక్షణను అందిస్తుంది.
New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!