Telangana new secretariat: సచివాలయం నలుదిక్కులా ద్వారాలు.. దేనిలోనుంచి ఎవరు వస్తారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana new secretariat: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ‘డా. బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్’ప్రారంభానికి సిద్ధమయ్యింది. నూతన సచివాలయ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఇవాల మధ్యాహ్నం 1:20 గంటలకు ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు.
సచివాలయానికి నాలుగు దిశల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిలో వాయువ్య ద్వారం అవసరమైనప్పుడు మాత్రమే తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల కదలికలు ఈశాన్య ద్వారం గుండా కొనసాగుతాయి. ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) ద్వారం సందర్శకుల కోసం ఉపయోగించబడుతుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. తూర్పు ద్వారం (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు మరియు ముఖ్యమైన ఆహ్వానితులకు, దేశ, విదేశీ అతిథులకు మాత్రమే వినియోగిస్తారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
Read also: Warangal Crime: ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లింది.. లైంగిక దాడికి గురైంది
బాహుబలి మహాద్వారాన్ని 29 అడుగుల వెడల్పు మరియు 24 అడుగుల ఎత్తుతో నాలుగు తలుపులతో నిర్మించారు. నాగ్పూర్లోని ఈ మహాద్వారాన్ని ఆదిలాబాద్ అడవుల్లోని టేకు చెక్కతో తయారు చేశారు. చెక్కపై ఇత్తడితో చెక్కారు. సచివాలయ ప్రాంగణం మొత్తం తలుపులన్నీ టేకుతో చేసినవే. తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్లకు భారీ గోపురాలున్నట్లే రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ గోపురాలు నిర్మించారు. 34 గోపురాలు మరియు సింహాల బొమ్మలు, జాతీయ చిహ్నం, కొత్త సచివాలయానికి కిరీటం. ప్రధాన గోపురం 165 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.
సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గోపురాలు నిర్మించారు. ప్రభుత్వ భవనాలు సహా ఆధునిక నిర్మాణాల్లో ఇంత భారీ గోపురాలు రూపొందించడం ఇదే తొలిసారి. ప్రతి గోపురం 82 అడుగుల ఎత్తు (సుమారు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇవి సచివాలయ భవన డిజైన్ ప్రకారం భవనానికి తూర్పు, పడమర వైపులా ఉన్నాయి. గోపురాల లోపలి భాగం స్కై లాంజ్ శైలిలో రూపొందించబడింది. ఇది దాని విశాలమైన కిటికీల నుండి చుట్టుపక్కల నగరం యొక్క వీక్షణను అందిస్తుంది.
New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!