New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Secretariat Security: తెలంగాణ కొత్త సచివాలయ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది! ముఖ్యంగా భద్రత దృష్ట్యా, ఇది సురక్షితమైన స్వర్గధామం! శత్రువు అందుకోలేని కట్టడం! చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత వలయం! డేగ కళ్లతో ఆహారం కాస్తుంటాయి. సచివాలయ భద్రత కోసం ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ క్షణాల్లో సెక్యూరిటీ గార్డుల కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. ఆ సెక్యూరిటీ లైన్ దాటిన తర్వాతే ఎవరైనా సచివాలయంలోకి ప్రవేశించగలరు. 650 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో నిత్యం పహారా కాస్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పటిష్టమైన సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా తమ సమాచారాన్ని ఆధార్ డేటాకు లింక్ చేస్తారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రపరిచిన డేటా ద్వారా సందర్శకుల పూర్తి వివరాలు తక్షణమే కంప్యూటర్ స్క్రీన్పై ప్రదర్శించబడతాయి.
Read also: Astrology: ఏప్రిల్ 30, ఆదివారం దినఫలాలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం మహాద్వారం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను ఒకేసారి తెరవనున్నారు. ఆయా శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు కూర్చోనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం పూర్తిగా తెల్లటి మార్బుల్తో, సిబ్బంది కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరుతో కనీసం 250 మంది కూర్చునేలా సభాస్థలిని ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేలా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించేందుకు 60 మందికి ఒక హాలు, 50 మందికి మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో భోజనం చేసేందుకు దాదాపు 25 మంది కూర్చునేలా అత్యాధునిక భోజనశాలను ఏర్పాటు చేశారు.
Telangana new secretariat inauguration: నేడే డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!