New Secretariat Security: కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Secretariat Security: తెలంగాణ కొత్త సచివాలయ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది! ముఖ్యంగా భద్రత దృష్ట్యా, ఇది సురక్షితమైన స్వర్గధామం! శత్రువు అందుకోలేని కట్టడం! చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత వలయం! డేగ కళ్లతో ఆహారం కాస్తుంటాయి. సచివాలయ భద్రత కోసం ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ క్షణాల్లో సెక్యూరిటీ గార్డుల కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. ఆ సెక్యూరిటీ లైన్ దాటిన తర్వాతే ఎవరైనా సచివాలయంలోకి ప్రవేశించగలరు. 650 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో నిత్యం పహారా కాస్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పటిష్టమైన సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా తమ సమాచారాన్ని ఆధార్ డేటాకు లింక్ చేస్తారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రపరిచిన డేటా ద్వారా సందర్శకుల పూర్తి వివరాలు తక్షణమే కంప్యూటర్ స్క్రీన్పై ప్రదర్శించబడతాయి.
Read also: Astrology: ఏప్రిల్ 30, ఆదివారం దినఫలాలు
Also Read
మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం మహాద్వారం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను ఒకేసారి తెరవనున్నారు. ఆయా శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు కూర్చోనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం పూర్తిగా తెల్లటి మార్బుల్తో, సిబ్బంది కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరుతో కనీసం 250 మంది కూర్చునేలా సభాస్థలిని ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేలా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించేందుకు 60 మందికి ఒక హాలు, 50 మందికి మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో భోజనం చేసేందుకు దాదాపు 25 మంది కూర్చునేలా అత్యాధునిక భోజనశాలను ఏర్పాటు చేశారు.
Telangana new secretariat inauguration: నేడే డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!