Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే..? ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణపై సమాలోచనలు కొనసాగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నారు. కాగా, గుర్తు, జాతీయ గీతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీకగా ఉండే మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచిన కొన్ని చిత్రాలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
Read also: Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఈ లోగోను రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదుకు పైగా డిజైన్లను పరిశీలించగా, ఒక్కటి మాత్రమే ఖరారు చేసిందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో అవతారోత్సవం ఉన్న నేపథ్యంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, కావాలనే రాజముద్రను మారుస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారని, చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని, హైదరాబాద్ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయ కళాక్షేత్రాన్ని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రూపొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rangareddy Crime: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. హత్య అంటున్న కుటుంబ సభ్యులు
తాజావార్తలు
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!