Niranjan Reddy: చెమట చిందించటమే కాదు, చెమట పట్టించడం కూడా తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేస్తోంది.. ఇప్పటికే వివిధ రూపాల్లో గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆ పార్టీ ఇప్పుడు.. హస్తిన వేదికగా ఢిల్లీపై యుద్ధం ప్రకటించింది.. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టారు.. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని.. వన్ నేషన్ – వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు చెమట చిందించటమే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి చెమట పట్టించడం తెలుసుని హెచ్చరించారు..
Read Also: Botsa Satyanarayana: మంత్రివర్గ కూర్పు అద్భుతం.. సమన్వయంతో ముందుకెళ్తాం..
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
కేంద్ర మంత్రితో చర్చలకు వెళ్తే అవమానించేలా మాట్లాడుతున్నారు.. నూకల బియ్యం మీ ప్రజలకు పెట్టండి అంటూ అవహేళన చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. రైతుల విషయంలో వ్యాపార దృక్పథంతో ఆలోచించకూడదు.. చెమటోడ్చి కష్టపడ్డారు.. తెలంగాణ రైతులు పంజాబ్ను తలదన్నేలా పంట దిగుబడి సాధించారని తెలిపారు.. ఇది గర్వించాల్సిన విషయం.. ఇదంతా కేసీఆర్ దార్శనికత ఫలితమన్న ఆయన.. కేవలం కొనే విషయంలోనే బాధ్యత కల్గిన కేంద్రం, ఆ పని చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.. చెమటోడ్చి కష్టపడడమే కాదు, కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా రైతులకు తెలుసన్నారు.. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చెంపలేసుకుని, రైతుల క్షమాపణ కోరిన నీతిమాలిన సర్కారు బీజేపీది అంటూ ఎద్దేవా చేశారు.. కనీస మద్ధతు ధర కోరుతూ నాడు సీఎంగా మోడీ కేంద్రానికి పంపిన ఫైలు, ఇప్పటికీ ప్రధాని టేబుల్ దగ్గరే పెండింగులో ఉందని విమర్శించారు మంత్రి నిరంజన్రెడ్డి. ఢిల్లీలో దీక్ష చేయడం మనకు సంతోషం కాదు. కానీ ఇలాంటి అనివార్య పరిస్థితులు కల్పించింది కేంద్రం అని మంత్రి మండిపడ్డారు. కేంద్ర మోసపూరిత వైఖరిని గ్రహించిన కేసీఆర్.. రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వానాకాలం పంటను కొనే సమయంలోనే యాసంగి పంటను కొనమని బీజేపీ చెప్పిందన్నారు..
తాజావార్తలు
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!