సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇప్పటికే ఎంతో మందికి నేనున్నానంటూ సాయాన్ని అందించిన ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య రెడ్డి.. సివిల్స్కు ప్రిపేర్ అవుతూ.. ఆర్థిక ఇబ్బందులతో గత నవంబర్లో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నారు.. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఫీజులు చెల్లించలేక ఢిల్లీలోని హాస్టల్లో ప్రాణాలు తీసుకుంది.. ఇక, ఐశ్వర్య మరణానంతరం ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది.. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పారు.. ఇవాళ ఐశ్వర్య కుటుంబాన్ని ప్రగతి భవన్కు పిలిచిన కేటీఆర్.. ఆ కుటుంబానికి రూ. 2.50 లక్షలు ఆర్థికసాయం చేశారు.. షాద్నగర్లో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. అక్కున చేర్చుకున్న మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు ఐశ్వర్య కుటుంబసభ్యులు.