రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు తో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత బంధు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చెప్పిన అన్ని కార్యక్రమాలు సిఎం కేసిఆర్ అమలు చేసి చూపారు. అదే స్ఫూర్తి తో దళిత బంధు అమలు చేసి తీరుతాం అని పేర్కొన్నారు.